న్యూఢిల్లీ, మే 2: ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది. (సబ్సిడీ చెల్లించిన తర్వాత). కేవలం కిలోమీటర్కు 25 పైసలు ఖర్చయ్యే ఈ బైకు సింగిల్ చార్జింగ్తో 129 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఇందుకోసం సంస్థ 6.37 కిలోవాట్ల పవర్ బ్యాటరీని వినియోగించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వెయ్యి మంది కస్టమర్లకు రూ.500 ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నది. దీంతోపాటు ఫెర్రాటో మరో బైక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధర రూ.1,59,999గా నిర్ణయించింది.