న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు క్రమేణా ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయిప్పుడు. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటున్నది మరి. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి. చివరకు బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, పోర్షే వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలూ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇక దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఆయా సంస్థలకు చెందిన 29 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ ఉండగా, వీటిలో కనిష్ఠ ధర రూ.4.5 లక్షలుగా.. గరిష్ఠ ధర రూ.2.45 కోట్లుగా ఉండటం విశేషం.