Oberoi Chairman | ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ( Chairman Emeritus of the Oberoi Group) పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (Prithvi Raj Singh Oberoi) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ‘ఈరోజు ఉదయం ఒబెరాయ్ గ్రూప్ ఎమెరిటస్ (గౌరవ) చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ (Prithvi Raj Singh) శాంతియుతంగా మరణించారని మేము తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాము. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్స్తోపాటు దేశవిదేశాల్లోని ఆతిథ్య రంగానికి తీరని లోటు’ అని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఒబెరాయ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్ గ్రూప్స్ తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించింది.
ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. దేశంలోనే కాదు అనేక దేశాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ఒబెరాయ్ హోటల్స్ , రిసార్ట్స్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు. అలా ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో ఒబెరాయ్ కీలక పాత్ర పోషించారు. ఒబెరాయ్ బ్రాండ్ లగ్జరీ హోటళ్లకు కెరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక ఒబెరాయ్ తన కెరీర్లో అనేక అవార్డులను, ప్రశంసలను అందుకున్నారు. పర్యాటకం, ఆతిథ్యంలో దేశానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఒబెరాయ్కు 2008లో భారత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ (Padma Vibhushan) అందించింది. ఆయనకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా వరించాయి.
Also Read..
Bhupesh Baghel | కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. వీడియో
Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
Caste Census: కుల గణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన అఖిలేశ్ యాదవ్