న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఈ నెల 28న ఐపీవోకి రాబోతున్నది ఈ-కామర్స్ సేవల సంస్థ నైకా. ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్కు చెందినదే ఈ నైకా. షేరు ధరల శ్రేణిని రూ. 1,085-1,125 గా నిర్ణయించింది. ఈ నెల 28న ఆరంభంకానున్న ఐపీవో నవంబర్ 1న ముగియనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాటా విక్రయంలో భాగంగా తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.630 కోట్లు సేకరించనున్నది. వీటిలో 2.50 లక్షల షేర్లు అర్హత కలిగిన ఉద్యోగులు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.