Nvidia CEO : 2022 నవంబర్లో ఓపెన్ఏఐ చాట్జీపీటీని లాంఛ్ చేసిన సమయంలో ఏఐ చాట్బాట్ సామర్ధ్యాలకు ఫిదా అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ హాట్ డిబేట్గా మారింది. చాట్జీపీటీతో జనరేటివ్ ఏఐ నూతన శిఖరాలకు చేరడంతో గూగుల్, మైక్రోసాప్ట్ వంటి టెక్ దిగ్గజాలు సైతం తమ సొంత చాట్బాట్స్ను క్రియేట్ చేశాయి. భవిష్యత్ ఏఐదే అని తేల్చేశారు. బిల్ గేట్స్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, సాం అల్ట్మన్ వంటి టెక్ దిగ్గజాలు జాబ్ మార్కెట్పై ఏఐ ప్రభావాన్ని పసిగట్టారు.
అయితే ఏఐ పలు అవకాశాలను సృష్టిస్తుందని కొందరు చెబుతుండగా, లక్షలాది కొలువులు లేటెస్ట్ టెక్నాలజీ ఫలితంగా కనుమరుగవుతాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఎన్విడియా సీఈవో జెన్సన్ హువంగ్ కూడా జాబ్ మార్కెట్పై ఏఐ ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఎవరైనా ప్రోగ్రామర్ అవుతారని, రాబోయే రోజుల్లో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదని హువంగ్ చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను అలవరుచుకునేలా చేయాలని పిలుపు ఇచ్చారు. ఓ దశాబ్ధం కిందట ప్రతి ఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని చెబుతుండేవారని, కానీ ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా తారుమారైందని చెప్పారు. ఏఐ రాకతో ప్రతి ఒక్కరూ ప్రోగ్రామరేనని, పిల్లలు కోడింగ్ ఎలా చేయాలని నేర్చుకోవాల్సిన పని లేదని అన్నారు. ప్రోగ్రామింగ్ భాష మానవీయంగా ఉండేలా టెక్నాలజీని క్రియేట్ చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారనేది కంప్యూటర్ అర్ధం చేసుకునే క్రమంలో ఇక ఎవరూ సీ++, జావా వంటి కోడింగ్ భాషల అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు. ఇది ఏఐ సృష్ఠించే అద్భుతమని ఆయన ప్రశంసించారు.
Read More :
Drugs | గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!