Nvidia CEO : ఏఐపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువంగ్ ఇటీవల న్యూ ఏఐ చిప్స్ ఆవిష్కరిస్తూ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. భవిష్యత్ రోబోలదేనని స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని రోబోలను మనం చూస్తామని అన్నారు. బ్లాక్వెల్ పేరుతో ఎన్విడియా న్యూ జనరేషన్ ఏఐ చిప్స్ను ప్రవేశపెట్టింది.
కాలిఫోర్నియా, శాన్జోస్లో జీటీసీ సదస్సు వేదికగా బ్లాక్వెల్ ప్రాసెసర్ డిజైన్ను హువంగ్ ఆవిష్కరించారు. భారీ జీపీయూల ఆవశ్యకత గురించి కూడా ఈ వేదికపై హువంగ్ ప్రస్తావించారు. ఎకానమీ మార్పులకు లోనవుతున్న క్రమంలో ఏఐ ఉత్ర్పేరక శక్తిగా పనిచేస్తుందని అన్నారు.
ఈ నూతన పారిశ్రామిక విప్లవానికి శక్తినిచ్చేందుకు ఎన్విడియా ప్రవేశపెట్టిన న్యూ బ్లాక్వెల్ చిప్స్ ఇంజన్లా పనిచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత డైనమిక్ కంపెనీలతో ఎన్విడియా కలిసి పనిచేస్తుందని, ప్రతి పరిశ్రమలో ఏఐ సామర్ధ్యాన్ని గుర్తిస్తుందని హువంగ్ పేర్కొన్నారు.
Read More :
IT Raids | చట్నీస్ హోటల్స్పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు