న్యూఢిల్లీ, జూలై 31:విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,444.72 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ. 2,948.94 కోట్ల లాభంతో పోలిస్తే 17 శాతం అధికమని పేర్కొంది. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.26, 794. 68 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికి రూ.30,390.60 కోట్లకు ఎగబాకినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.