హైదరాబాద్, మార్చి 6: రాష్ర్టానికి చెందిన వ్యవసాయ పనిముట్ల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్హెచ్పీ)ని దరఖాస్తు చేసుకున్నది కూడా. రూ.2 ముఖ విలువ కలిగిన 77,58,620 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్ విక్రయించడంతో రూ.140 కోట్లను సేకరించాలని సంస్థ భావిస్తున్నది. ఈ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ చేయనున్నది. ఇలా సేకరించిన నిధుల్లో రూ.14.20 కోట్లతో తన అనుబంధ సంస్థ నోవా అగ్రి సైన్స్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుండగా, మరో రూ.10.49 కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.