న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఖజానాపై రూ 45,000 కోట్ల భారం పడుతుందని, దీంతో ఆర్ధిక లోటు 0.3 శాతం పెరుగుతుందని విదేశీ బ్రోకరేజ్ కంపెనీ నోమురా గురువారం పేర్కొంది. ఇంధనాలపై సుంకాల తగ్గింపుతో ఏడాదికి రూ లక్ష కోట్ల రాబడి నష్టం వాటిల్లుతుందని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ 45,000 కోట్లని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
ఎక్సైజ్ సుంకం కోతతో ఆర్ధిక లోటు అంచనా 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగిందని పేర్కొంది. కాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు రూ 5, డీజిల్పై లీటర్కు రూ 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని బుధవారం తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్పై ఎ క్సైజ్ సుంకం తగ్గింపుతో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 0.3 శాతం తగ్గుతుందని నోమురా నివేదిక అంచనా వేసింది.