హైదరాబాద్, ఆగస్టు 12: ప్రభు త్వ రంగ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ నికరలాభం భారీగా పెరిగింది. తాజా గా ముగిసిన జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గతేడాది ఇదేకాలంతో పోల్చితే రూ.531 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 2,009 కోట్ల నుంచి రూ. 6,656 కోట్లకు చేరినట్లు స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ఇనుప ఖనిజం మైనింగ్లో దిగ్గజ కంపెనీ అయిన ఎన్ఎండీసీ ఖర్చులు జూన్ త్రైమాసికంలో రూ. 1,250 కోట్ల నుంచి రూ. 2,394 కోట్లకు పెరిగాయి.