హైదరాబాద్, ఆగస్టు 11: దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,661.04 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,471.24 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికమని పేర్కొంది.
2022-23 తొలి త్రైమాసికంలో రూ.4,913.06 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం..గత త్రైమాసికానికిగాను రూ.5,688.87 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.2,968.94 కోట్ల నుంచి రూ.3,476.55 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.