హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ టన్నుల కంటే ఇది 37.5 శాతం అధికం.
అలాగే కంపెనీ విక్రయాలు కూడా 2.83 మిలియన్ టన్నుల నుంచి 25 శాతం పెరిగి 3.54 మిలియన్ టన్నులకు పెంచుకున్నది. మరోవైపు, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో సంస్థ 16.56 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 17.43 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది.