NITI Aayog Panagariya | చైనాతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంపై నీతి ఆయోగ్ మాజీ వైస్చైర్మన్ అరవింద్ పనగరియా హెచ్చరికలు జారీ చేశారు. చైనాతో వాణిజ్య బంధాన్ని తెగదెంపులు చేసుకుంటే భారత ఆర్థిక వృద్ధిరేటును త్యాగం చేయడమేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో చైనాతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో పనగరియా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నది.
చైనాతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి బదులు యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలతో తన వ్యాపారాన్ని విస్తరించాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనగరియా సూచించారు. అందుకోసం ఆయా దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత తరునంలో చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగితే దేశ ఆర్థిక వృద్ధిని త్యాగం చేయడమేనన్నారు. ఆర్థిక పరిస్థితుల్లో సంబంధాలు తెగదెంపులు చేసుకోవడం తెలివైన చర్య కాదని వ్యాఖ్యానించారు.
అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవునా ఈ నెల తొమ్మిదో తేదీన భారత్, చైనా సైనిక బలగాలు ఘర్షణకు దిగాయి. ఇరు సైనిక జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్న పనగరియా.. నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్గా సేవలందించారు.