న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో 23 నూతన ఎలక్ట్రిక్, ఈ-పవర్తో కూడిన వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిస్సాన్ సన్నాహాలు చేపట్టింది. 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లాంఛ్ లక్ష్యంగా నిస్సాన్ ముందుకెళ్లనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నిస్సాన్ యాంబిషన్ 2030 మిషన్ కింద అత్యాధునిక టెక్నాలజీతో నూతన తరం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రవేశపెడతామని నిస్సాన్ సీఈఓ మకటొ ఉచిద వెల్లడించారు.
కస్టమర్లు, సమాజం అభిరుచులకు అనుగుణంగా నిస్సాన్ను సస్టెయినబుల్ కంపెనీగా మలుస్తామని అన్నారు. కీలక మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచుకునేందుకు నిస్సాన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.