ముంబై, జనవరి 7: ఎల్ఐసీ ఐపీవోపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష జరిపారు. మార్చికల్లా వస్తుందని భావిస్తున్న ఈ మెగా ఐపీవోపై పలువురు కీలక అధికారులతో శుక్రవారం మంత్రి సమావేశమయ్యారు. దీపమ్ కార్యదర్శి, ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం కార్యదర్శి, ఎల్ఐసీ సీనియర్ అధికారులతో.. నిర్మల సమీక్షించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని గత బడ్జెట్లో కేంద్రం నిర్దేశించగా, ఇప్పటివరకూ ప్రభుత్వ సంస్థల వాటా విక్రయాల ద్వారా రూ. 9,330 కోట్ల సేకరణ మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎల్ఐసీ ఐపీవోను పూర్తిచేయాలని కేంద్రం భావిస్తున్నది.