ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,461.30 పాయింట్ల నష్టపోయి.. 52,792.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 430.90 పాయింట్లు క్షీణించి 15,809.40 వద్ద ట్రేడింగ్ ముగిసింది. దాదాపు 838 షేర్లు లాభాల్లో ఉండగా.. 2,413 షేర్లు నష్టాల్లో కొనసాగాయి. 122 షేర్లు మారలేదు.
నిఫ్టీలో విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి. మెటల్, ఐటీ సూచీలు నాలుగు నుంచి ఐదు శాతం మధ్య క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు రెండు శాతానికిపైగా నష్టపోయాయి.