హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ రీజినల్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్న కె విద్యాధర్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నిక సమావేశాన్ని బేగంపేటలోని సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించారు. 2021-22కిగాను కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్యదర్శి ఎస్వీఆర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.