దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ధోరణి శరవేగంగా పెరుగుతోంది. గత నెలలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా 3.65 బిలియన్ల లావాదదేవీల్లో రూ.6.5 లక్షల కోట్ల చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే జరిగాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇది దేశీయ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో సరికొత్త రికార్డు. వరుసగా మూడో నెలలో మూడు బిలియన్లకు పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
ఆగస్టులో 355 బిలియన్ల ట్రాన్సాక్షన్స్లో రూ.6.39 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. దీని ప్రకారం ట్రాన్సాక్షన్స్లో మూడు శాతం, విలువలో 2.35 శాతం పెరిగాయి. యూపీఐ పేమెంట్స్ ప్రారంభించిన నాలుగేండ్లలోనే డిజిటల్ చెల్లింపులు 1200 రెట్లు పెరిగాయి.
2016లో యూపీఐ ప్రారంభమైంది. ఆ ఏడాది 1.8 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగితే రూ.70 వేల కోట్ల పేమెంట్స్ జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2,233.1 కోట్ల లావాదేవీల్లో రూ.41 లక్షల కోట్ల చెల్లింపులు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నాలుగేండ్లలో 1200 రెట్లు లావాదేవీలు పెరిగితే, దాని విలువలో 50 శాతం ఎక్కువైంది.