న్యూఢిల్లీ : భారత్లో న్యూ సెలెరియోను లాంఛ్ చేసిన రెండు నెలలకే మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ వేరియంట్ను లాంఛ్ చేసింది. మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ రూ 6.58 లక్షల (ఎక్స్ షోరూం)కు అందుబాటులో ఉంటుంది. వీఎక్స్ఐ వేరియంట్లోనే సెలెరియో సీఎన్జీ లభించనుంది.
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ డ్యూయల్ ఇంటర్డిపెండెంట్ ఈసీయూ (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్), ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్తో ముందుకొచ్చింది. ఏసీ, ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్సైడ్ మిర్రర్స్, పవర్ స్టీరింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వంటి ఫీచర్లతో మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ వేరియంట్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
భారత్లో గ్రీన్ వెహికల్స్ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆల్ న్యూ సెలెరియో ఎస్-సీఎన్జీ మైలురాయి వంటిదని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ వాహనం కస్టమర్లకు అందుబాటు ధరలో, సురక్షిత, అధిక సామర్ధ్యం కలిగిన గ్రీన్ వెహికల్గా ఆదరణ పొందుతుందని అన్నారు.