Kia Seltos | న్యూఢిల్లీ, జూలై 21: మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కియా ఇండియా..దేశీయ మార్కెట్కు సరికొత్త సెల్టోస్ను ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యలో లభించనున్నది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో ఈ కారును తీర్చిదిద్దింది.
అడ్వాన్స్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్(ఏడీఏఎస్) లెవల్ 2, భద్రత ఫీచర్లు, నూతన టెక్నాలజీ, యువతను దృష్టిలో పెట్టుకొని ఈ మాడల్ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బుకింగ్లు ఆరంభించిన తొలిరోజే 13 వేల బుకింగ్లు వచ్చాయి.