న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఎస్యూవీ మార్కెట్లో మరింత పోటీని పెంచే ఉద్దేశంలో భాగంగా హ్యుందాయ్ మోటర్ తాజాగా సరికొత్త టక్సన్ను పరిచయం చేసింది. నాలుగో జనరేషన్గా విడుదల చేసిన ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్నది. రెండు లీటర్ల ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 156 పీఎస్, 186 పీఎస్ల శక్తినివ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
దేశీయంగా ప్రీమియం ఎస్యూవీల మార్కెట్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మోడల్ను వచ్చే నెల మొదట్లో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సో కిమ్ తెలిపారు. 2021లో ప్రపంచ మార్కెట్లోకి అడుగు పెట్టిన ఈ మోడల్ ఇప్పటి వరకు 70 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 246 సిగ్నేచర్ అవుట్లెట్లలోనే ఈ మోడల్ లభించనున్నది.