న్యూఢిల్లీ : భారత్లో వచ్చే నెల లాంఛ్ కానున్న ఆడి క్యూ7 ఫేస్లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆడి ఇండియా తెలిపింది. పలు కాస్మెటిక్, ఫీచర్ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకు రానున్న ఆడి క్యూ7ను రూ 5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ధర రూ 75 లక్షల నుంచి రూ 80 లక్షల వరకూ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ వేరియంట్స్లో ఆడి క్యూ7 లభించనుంది. ఆడి క్యూ7 లాంఛ్ అయితే బీఎండబ్ల్యూ X5, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్సీ90లకు దీటైన పోటీ ఇవ్వనుంది.
2021లో తొమ్మిది వాహనాలను లాంఛ్ చేసిన తర్వాత 2022 ఆరంభంలో మరో లెజెండరీ ఆడి క్యూ7కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ఈ వెహికల్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిలియన్ పేర్కొన్నారు. కంపెనీ వెబ్సైట్ లేదా దేశవ్యాప్తంగా ఆడి డీలర్షిప్ల వద్ద ఆడి క్యూ7ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.