న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఏజీఆర్ బకాయిల కోసం కేటాయింపులు జరిపిన కారణంగా 2020 ఏప్రిల్-జూన్లో భారీ నష్టాన్ని ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆర్జించిన రూ.762 కోట్ల లాభంతో పోలిస్తే ఈ జూన్లో లాభం 62 శాతం క్షీణించింది. తాజాగా ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం 15.3 శాతం వృద్థితో రూ. 26,854 కోట్లకు పెరిగింది.