హైదరాబాద్, జనవరి 4: దేశంలో అతిపెద్ద డయాల్సిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్..తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరిస్తున్నది. ఉజ్బెకిస్తాన్లో డయాల్సిస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో రూ.69.50 కోట్ల నిధులను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా పొందినట్లు వెల్లడించింది. డయాల్సిస్ కేంద్రాల డిజైనింగ్, ఆపరేటింగ్, నిర్వహణ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.