హైదరాబాద్, ఫిబ్రవరి 12 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.151 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది నాట్కో ఫార్మా. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.132 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నది.
ఏడాది క్రితం రూ.475 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈసారికిగాను రూ.647 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.5 మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రకటించింది. నీ చైర్మన్, ఎండీ వెంకయ్య చౌదరి నన్నపనేని మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.