న్యూఢిల్లీ, జనవరి 30: రుణాలపై వడ్డీరేట్లను 55 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది ముత్తూట్ మైక్రోఫిన్. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత వాటికి కూడా ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది.
గత రెండేండ్లుగా రుణాలపై వడ్డీరేట్లను 150 బేసిస్ పాయింట్లు పెంచిన సంస్థ..ఈసారి మాత్రం 55 బేసిస్ పాయింట్లు కోత విధించడం విశేషం. సరాసరిగా సంస్థ రుణాలపై 22.5 శాతం నుంచి 24.9 శాతం లోపు వడ్డీని వసూలు చేస్తున్నది.