హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్(ఎంఎస్ఎంఈ-డీఎఫ్వో), ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్అసోసియేషన్ (ఎఫ్ఈటీఎస్ఐఏ) సంయుక్తంగా హైదరాబాద్లో ‘వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటుచేశారు. చిన్న పరిశ్రమలకు మార్కెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి బీఈఎల్, ఐవోసీఎల్, బీడీఎల్, టీఎస్ఆర్టీసీ, ఈసీఐఎల్, ఎన్ఎస్ఐసీ, సీఐటీడీ, ఎన్ఎండీసీ, సిడ్బీ, యూకో తదితర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు పాల్గొని తమకు అవసరమైన ఉత్పత్తులను ప్రదర్శించాయి.
ఎంఎస్ఎంఈలకు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థల అవసరాలు, వారికి అవసరమైన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న పరిశ్రమలకు అందిస్తున్న రాయితీల గురించి వివిధ బ్యాంకుల ప్రతినిధులు వివరించారు.