హైదరాబాద్, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఐటీ పరిష్కారాల సంస్థ మౌరి టెక్..వచ్చే మూడేండ్లకాలంలో భారత్లో 10వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. వీరిలో తొలి 2 వేల ఉద్యోగులను 2021-22లోనే నియమించుకోనుండగా..మొగతా వెయ్యి మందిని ఆ తర్వాతి ఏడాదిలో రిక్రూట్ చేసుకోనున్నది. వీరిలో హైదరాబాద్ కార్యాలయంలోనే 3000 మందికి పైగా సిబ్బందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక తమ వ్యాపార అవకాశాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయనే అంచనాల నడుమ అదనపు సామర్థ్యపు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు కంపెనీ గ్లోబల్ సీఈవో అనిల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ణులైన మధ్య, సీనియర్ స్థాయి ఐటీ ప్రొపెషనల్స్తోపాటు తాజా గ్రాడ్యుయేట్లను కూడా క్యాంపస్, జాబ్ మేళాలు, సామాజిక మాధ్యమాల ద్వారా నియమించుకోవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.