న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రాబోతున్నాయి. ప్రస్తుత నెలలో అరడజన్ సంస్థలు తమ కార్లను విడుదల చేయబోతున్నాయని ప్రకటించాయి. వీటిలో లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్లూతోపాటు మెర్సిడెజ్ బెంజ్, రెనో, మారుతి, నిస్సాన్లు ఉన్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ నెల చివర్లో నయా బ్రెజ్జా మాడల్ను తీసుకురాబోతున్నది.
1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో తీర్చిదిద్దిన మాడల్లో 10.1 ఇంచుల టచ్స్క్రీన్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది. ఇప్పటికే రెనో క్విడ్ మాడల్ అందుబాటులోకి వచ్చింది. 10.1 ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది.
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో తయారైన ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ వెర్షన్ కూడా తీసుకొచ్చింది. దీంతోపాటు టెక్టాన్ మాడల్ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నది. మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ మాడల్ను తీసుకొస్తున్నది. హ్యుందాయ్ క్రెటా, టాటా సియర్రా, కియా సెల్టోస్లకు పోటీగా సంస్థ ఈ కారును విడుదల చేస్తున్నది. గత నెలలో మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మాడల్తోపాటు టాటా సియర్రా ఈవీ అందుబాటులోకి తెచ్చాయి.