హైదరాబాద్, మే 31: మురుగప్ప గ్రూప్నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ మోటర్స్.. హైదరాబాద్ మార్కెట్కు తమ సరికొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ను పరిచయం చేసింది. శేరిలింగంపల్లిలోని దర్గా రోడ్డు దగ్గర నూతన మోంట్రా ఎలక్ట్రిక్ షోరూంను సంస్థ సీఈవో సుశాంత్ జెనా, డీలర్ గోపాల్రెడ్డి, నేషనల్ హెడ్ రాఘవరావు, జోనల్ సేల్స్ హెడ్ ప్రదీప్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగానే సూపర్ ఆటోను ఆవిష్కరించారు.
దీని ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.3.02 లక్షలు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 197 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సీఈవో జెనా తెలిపారు. టెస్ట్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ఆటో బుకింగ్స్ మొదలయ్యాయని డీలర్ గోపాల్రెడ్డి వెల్లడించారు. ఆకర్షణీయమైన డిజైన్లో స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఆటోను కొన్నవారికి వారెంటీ, రోడ్సైడ్ అసిస్టెన్స్ను కూడా అందిస్తామని చెప్పారు.