న్యూఢిల్లీ, మార్చి 3: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కార్లను కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ షోరూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. తొలి విడుతలో భాగంగా 100 మొబైల్ షోరూంలను నెలకొల్పుతున్నది. కస్టమర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉంటే ఈ షోరూంల సంఖ్యను మరింత పెంచబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత మార్కెట్లో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు, షోరూం ఆన్ వీల్ ద్వారా గ్రామాలకు చెందిన కస్టమర్లకు చేరుకోవడానికి వీలు పడనున్నదని తెలిపింది. ఈ మొబైల్ షోరూంలో ఇటీవలకాలంలో విడుదల చేసిన మోడళ్ళు, ఎస్యూవీలు, విడిభాగాలు, ఆర్థిక స్కీంల గురించి సమాచారం లభించనున్నది.