KTR | హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ( EPG ) ఈ ఏడాది మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో నిర్వహించనున్న తమ ద్వితీయ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’( Ideas For India ) సదస్సులో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR )ను ఆహ్వానించింది.
కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని, ముఖ్యంగా తెలంగాణ( Telangana ) సాధించిన ఆర్థిక ప్రగతిని తెలుసుకునేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు నిర్వాహకులు తమ ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. సదస్సులో భాగంగా ఎంపీ(లేబర్) సీమా మల్హోత్రా, బ్లాక్-టై సెలబ్రేషన్స్ ఆధ్వర్యంలో హౌస్ ఆఫ్ కామన్స్లో ఏర్పాటు చేయనున్న విందులో యూకే క్యాబినెట్ మంత్రితోపాటు పాల్గొనాలని కూడా వారు కేటీఆర్కు ఆహ్వానం పలికారు. యూకే అంతటా జరగనున్న భారత వారోత్సవాల ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార, మీడియా, రాజకీయ తదితర రంగాలకు చెందిన 800మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.