న్యూఢిల్లీ : మిని ఇండియా ఆల్ ఎలక్ట్రిక్ మిని త్రీడోర్ కూపర్ ఎస్ఈ ప్రీ బుకింగ్స్ను శుక్రవారం ప్రారంభించింది. రూ లక్ష చెల్లించి ఈ వాహనాన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్గా భారత్లో మిని విజయవంతమైంది. భారత్లో తొలి ఆల్ ఎలక్ట్రిక్ ప్రీమియం స్మాల్ కారుగా న్యూ మిని 3 డోర్ కూపర్ ఎస్ఈ కస్టమర్ల ముందుకొస్తోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రం పవా పేర్కొన్నారు.
ప్రీ బుకింగ్స్ ద్వారా తమ కస్టమర్లు, మిని అభిమానులు లాంఛ్కు ముందే క్రేజీ వెహికల్ను కొనుగోలు చేయడమే కాకుండా ఆల్ ఎలక్ట్రిక్ మినీని దేశంలో తొలిసారిగా డ్రైవ్ చేసే అనుభూతి పొందుతారని చెప్పారు. 32.6కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఎలక్ట్రిక్ మిని 270 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. మిని 3 డోర్ కూపర్ ఎస్ఈ వైట్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, మూన్వాక్ గ్రే, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.