ముంబై, జూన్ 23: తెలుగుతేజం సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచంలో యాపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. తాజాగా న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్లో మైక్రోసాఫ్ట్ షేరు ధర 266 డాలర్లను చేరడంతో ఈ ఫీట్ సాధ్యపడింది. క్లౌడ్ కంప్యూటింగ్లో కంపెనీ సాధిస్తున్న ప్రగతి కారణంగా కొద్దివారాలుగా ఆ షేరు జోరుగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు సత్య నాదెళ్లకు ఇటీవల ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే.