Microsoft CEO : భారత్ సహా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏఐపై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆకాంక్షించారు. బెంగళూర్లో గురువారం జరిగిన మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్ ఈవెంట్లో డెవలపర్లను ఉద్దేశించి టెక్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు చేశారు. కంప్యూటర్లను మనం అర్ధం చేసుకోవడం కాకుండా మనల్ని అవి అర్ధం చేసుకునే డివైజ్లను సృష్టించడం గురించి సత్య నాదెళ్ల కీలకోపన్యాసంలో ప్రస్తావించారు.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్, జనరేటివ్ ఏఐ సేవలు డెవలపర్లకు అందించే సాయం గురించి ఆయన వివరించారు. మైక్రోసాఫ్ట్ సర్వీసుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ మరింత సాధికారికంగా తయారుచేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆకాంక్షను సత్య నాదెళ్ల పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ను విస్తరిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటిస్తూ భారతీయుల్లో అత్యధిక డెవలపర్లకు సాధికారత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భారత్లో డెవలపర్లు, ఎన్జీవోలు, స్టార్టప్లకు కోపైలట్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు అందిస్తున్న సేవల గురించి సత్య నాదెళ్ల సహా మైక్రోసాప్ట్ ఉన్నతాధికారులు వివరించారు.
ఇక భారత్లో డెవలపర్లకు సంబంధించి సత్య నాదెళ్ల కొన్ని ఆసక్తికర గణాంకాలు, భవిష్యత్ అంచనాలను పంచుకున్నారు. గిట్హబ్పై మోస్ట్ జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్ను క్రియేట్ చేసిన ప్రపంచంలో రెండో అతిపెద్ద కమ్యూనిటీగా భారత్ సత్తా చాటిందని వివరించారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ భారత్లో మరిన్ని ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలో మెరుగైన ఏఐ మౌలిక వసతులను నిర్మించే దిశగా తమ కంపెనీ కసరత్తును కొనసాగిస్తోందని సత్య నాదెళ్ల వివరించారు.
Read More :