న్యూఢిల్లీ : భారత్ మార్కెట్కు అనుగుణంగా అందుబాటు ధరలో న్యూ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంఛ్ చేసేందుకు ఎంజీ మోటార్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి వెలువడే న్యూ కారు టాటా టిగోర్ ఈవీ, టాటా నెక్సన్ ఈవీలకు దీటైన పోటీ ఇవ్వనుంది.
భారత్లో ప్రస్తుతం ఎంజీ జడ్ఎస్ ఈవీని సేల్ చేస్తున్న కంపెనీ వచ్చే ఏడాది చివరి నాటికి న్యూ ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేసే ప్రణాళికలకు పదునుపెడుతోంది. జడ్ఎస్ ఈవీ రెండు వేరియంట్లు ప్రస్తుతం రూ 21 లక్షల నుంచి రూ 24.68 లక్షల మధ్య అందుబాటులో ఉండగా మాస్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ న్యూ ఎలక్ట్రిక్ కారును రూ 10 లక్షల నుంచి రూ 15 లక్షల మధ్య లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఎస్యూవీ ఆస్టర్ తర్వాత భారత్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని న్యూ ఎలక్ట్రిక్ వాహనాన్ని కస్టమర్ల ముందుకు తీసుకువస్తామని ఎంజీ మోటార్ ఇండియా పప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా వెల్లడించారు. భారత్లో ఈవీ నిబంధనలు, దేశీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా భారత్ కోసమే ఈ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేస్తామని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.