హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం కనుగొనడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇంటింటా ఇన్నోవేటర్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్, స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తాజాగా స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఎడ్యుటెక్ స్టార్టప్ అయిన మెటా మార్పోసిస్ సంస్థతో కలిసి పనిచేయనుంది. దీనికి సంబంధించిన పరస్పర ఒప్పందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సమక్షంలో చేసుకున్నామని టీఎస్ఐసీ ప్రతినిధి ప్రణయ్ తెలిపారు. గత రెండేళ్లుగా టీఎస్ఐసీ నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్లో టాప్ 5లో ఎంపికైన ఆలోచనలను మెరుగుపర్చేందుకు కలిసి పనిచేస్తారన్నారు.