న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్లో చాట్జీపీటీ లాంఛ్ అయినప్పటి నుంచి లేటెస్ట్ ఏఐ టూల్ టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్గా మారింది. ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ రాకతో గతంలో కేవలం మనుషులు మాత్రమే చేయగలరనుకున్న పనులను న్యూ టెక్నాలజీ చక్కదిద్దుతుండగా భవిష్యత్లో ఈ టెక్నాలజీ మరింత విస్తరించనుంది. చాట్జీపీటీకి విశేష ఆదరణ లభించడంతో గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ దిగ్గజాలు ఏఐ టూల్స్పై ఫోకస్ పెంచాయి.
మెటా (Meta CEO) సైతం చాట్జీపీటీకి దీటుగా ఏఐ టూల్ను అభివృద్ధి చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. చాట్జీపీటీని అందుకునే టెక్నాలజీతో ముందుకు రాకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం అంతరించిపోతాయని కంపెనీ టాప్ ఏఐ సైంటిస్ట్ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ను హెచ్చరించడం కలకలం రేపింది. ఏఐ రేసులో మెటా ఇప్పటికీ పూర్తిస్ధాయిలో అడుగుపెట్టలేదు.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలో భాగంగా తన సొంత ఏఐ చాట్బాట్స్ గురించి కంపెనీ ప్రకటించింది. ఓపెన్ఏఐ న్యూ చాట్బాట్ను అందుకోవాల్సిన అవసరం ఉందని, త్వరలో సొంత ఏఐ అసిస్టెంట్ను విడుదల చేయాలని మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యా్ లికున్ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్తో స్పష్టం చేసినట్టు సమాచారం. సొంత ఏఐ అసిస్టెంట్పై మెటా సత్వరమే కసరత్తు సాగంచనిపక్షంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం అంతరించిపోతాయని లికున్ జుకర్బర్గ్ను హెచ్చరించారు. కాగా, లికున్ అభిప్రాయంతో జుకర్బర్గ్ ఏకీభవించాడని సమాచారం.
Read More :
Life span of human | మనుషులు 200 ఏండ్లు జీవించకపోవడానికి కారణమిదేనా?