న్యూయార్క్, డిసెంబర్ 5: మనుషులు వందేండ్లే ఎందుకు జీవిస్తారు? 200 ఏండ్లు ఎందుకు జీవించరు? అనేది చాలామంది ప్రశ్న. ఈ ప్రశ్నకు బర్మింగ్హామ్ వర్సిటీ పరిశోధకులు సమాధానాన్ని కనుగొన్నారు. వంద మిలియన్ ఏండ్ల కిందట డైనోసార్ల పరిణామ ఒత్తిళ్లు ఆధునిక క్షీరదాల వయసుపై చెరగని ముద్ర వేశాయని గుర్తించారు.
డైనోసార్లలాంటి ప్రారంభ క్షీరదాలు నిరంతర ముప్పులో ఉండటంతో మనుగడ కోసం వేగవంతమైన పునరుత్పత్తి చేయడంతో దీర్ఘాయువు సంబంధిత జన్యునష్టం లేదా క్రియారహితం అయినట్టు తేల్చారు. పరిణామ క్రమంలో అది కొనసాగుతూ ఆధునిక క్షీరదాలపై ఈ ప్రభావం పడిందని, అందుకే మనుషులు 200 ఏండ్లు బతకడం అసాధ్యంగా మారిందని కనుగొన్నారు.