Meesho Festive Sales | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీషో ఫెస్టివల్ సేల్స్లో అదరగొట్టింది. ఐదు రోజుల పాటు సాగిన ఫెస్టివ్ సేల్స్లో 3.34 కోట్ల ఆర్డర్లు వచ్చాయని గురువారం తెలిపింది.ఈ నెల 23-27 తేదీల నిర్వహించిన మీషో మెగా బ్లాక్ బస్టర్ సేల్లో టైర్-4 సిటీస్ నుంచే సుమారు 60 శాతం ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే మొత్తం ఫెస్టివ్ సేల్స్ 68 శాతం సేల్స్ పెరిగాయని వివరించింది. వీరిలో 60 శాతం మంది తొలిసారి ఆన్లైన్ ఆర్డర్లు బుక్ చేసిన వారేనని మీషో తెలిపింది.
హిమాచల్ప్రదేశ్లోని ఉనా, ఆంధ్రప్రదేశ్లోని చీమకుర్తి, పశ్చిమ బెంగాల్లోని కలింపాంగ్, గుజరాత్లోని భారుచ్, లేహ్ తదితర చిన్న పట్టణాలు, నగరాల నుంచే ఆర్డర్లు అందుకున్నట్లు మీషో పేర్కొంది. 80 శాతానికి పైగా ఆర్డర్లు టైర్-2, అంతకంటే తక్కువ నగరాలు, పట్టణాల నుంచే వచ్చాయని మీషో ఫౌండర్ కం సీఈవో విదిత్ అత్రేయ్ చెప్పారు. జీరో పర్సెంట్ సెల్లర్ కమిషన్ ఇన్సియేటివ్తో మీషో ఆన్లైన్ విక్రయాలు చేపట్టిందన్నారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కమీషన్ల రూపేణా రూ.104 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
మారుమూల ప్రాంతాలకు తమ ఉత్పత్తుల విక్రయాలను తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేశాం అని విదిత్ ఆత్రేయ్ తెలిపారు. తమ సేల్స్లో 116 శాతం టాప్ గ్రోత్ సేల్స్ `కిచెన్ యుటిలిటీస్`ఉన్నాయి. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఆర్డర్లు 109 శాతం, లగేజీ, ట్రావెల్ వస్తువులు 99 శాతం ఉన్నాయన్నారు. ఫ్యాషన్తోపాటు హోమ్ అండ్ కిచెన్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మీ మహా దీపావళి సేల్స్ అక్టోబర్ ఏడో తేదీ నుంచి 11 మధ్య ఉంటుందని మీ షో తెలిపింది.