Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,671.35 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 175.31 పాయింట్లు (0.26 శాతం) లబ్ధి పొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లాభ పడ్డాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనమైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 26,014.36 పెరిగి రూ.16,19,907.39 కోట్లకు పుంజుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.20,490.9 కోట్లు పుంజుకుని రూ.11,62,706.71 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,135.21 కోట్ల లబ్ధితో రూ.5,46,720.84 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,484.03 కోట్లు నష్టపోయి రూ.12,65,153.60 కోట్లతో సరిపెట్టుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.12,202.87 కోట్లు కోల్పోయి రూ.4,33,966.53 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,406.91 కోట్లు పతనమై రూ.5,90,910.45 కోట్ల వద్ద ముగిసింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,543.51 కోట్ల నష్టంతో రూ.5,00,046.01 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,808.36 కోట్ల పతనంతో రూ.5,46,000.07 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.290.53 కోట్లు కోల్పోయి రూ.5,96,391.22 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.