Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.70,486.95 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మార్కెట్ లీడర్లుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ భారీగా నష్టపోయాయి. వీటితోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్) లాభ పడ్డాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 298.22 పాయింట్లు లేదా 0.48 శాతం నష్టపోయింది.
భారీగా నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,941.49 కోట్లు కోల్పోయి రూ.16,52,702.63 కోట్ల వద్ద స్థిర పడింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.19,027.06 కోట్ల పతనంతో రూ.11,78,854.88 కోట్లతో సరిపెట్టుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,527.02 కోట్లు నష్టంతో రూ. 9,20,568.10 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.9,585.82 కోట్ల నష్టంతో రూ.4,99,848.62 కోట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.2,722.01 కోట్లు కోల్పోయి రూ.5,13,209.81 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.683.55 కోట్ల నష్టంతో రూ.5,21,852.46 కోట్లతో సరిపెట్టుకున్నది.
మరోవైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,733.98 కోట్లు పెరిగి రూ.5,26,491.90 కోట్ల వద్దకు చేరుకున్నది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.7,722.54 కోట్ల లాభంతో రూ.4,49,050.34 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.7,716.4 కోట్ల లబ్ధితో రూ.6,67,196.10 కోట్ల వద్దకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.4,229.27 కోట్లు పెరిగి రూ.6,20,621.04 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్-10లో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. తర్వాతీ జాబితాలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇన్పోసిస్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.