హైదరాబాద్, సెప్టెంబర్ 1: బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం సేవలు అందిస్తున్న మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్..దక్షిణాది మార్కెట్లో పాగావేసింది. ఇప్పటికే ఉత్తరాదిలో సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైలలో ప్రాంతీయ కార్యాలయాన్ని తెరిచింది.
ప్రాంతీయ కస్టమర్లకు సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాలను తెరిచినట్టు, ఇందుకోసం 150 మంది నిపుణులను నియమించుకున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ ఎండీ హర్జీత్ సింగ్ అరోరా తెలిపారు. దీంతో దక్షిణాదిలో ఉన్న కస్టమర్లకు మెరుగైన ఆర్థిక సేవలు వేగంగా అందించడాని వీలుపడనున్నదని చెప్పారు. అత్యధిక అవకాశాలున్న ఈ నగరాల మార్కెట్పై నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఇక్కడ ఉన్న సంపన్నవర్గాలు, కార్పొరేట్లు, బీ2సీ క్లయింట్లకు నేరుగా సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.