హైదరాబాద్, నవంబర్ 7: ప్రముఖ వైద్య సేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెపెఎ్టంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ.101 కోట్లకు పడిపోయింది. ఆదాయం మాత్రం 14.3 శాతం పెరిగి రూ.573 కోట్ల నుంచి రూ.655 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.80.8 కోట్లతో పోలిస్తే మాత్రం 15 శాతం ఎగబాకింది. గత త్రైమాసికంలో రోగుల సంఖ్య క్రమంగా పెరిగారని, వచ్చే రెండేండ్లలో పడకల సంఖ్యను 8 వేలకు పెంచడానికి తమ వ్యాపార విస్తరణ ప్రణాళిక యథాతథంగా కొనసాగుతున్నదని కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ బీ భాస్కర్ రావు తెలిపారు. బెంగళూరు, నాసిక్, ముంబైలో ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రావచ్చునని చెప్పారు.