నూఢిల్లీ, మార్చి 14: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ.. దీంట్లోభాగంగా పలు వాహనాలపై భారీగా రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు పెట్రోల్ లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవీల వాడకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
దీంట్లోభాగంగా నూతన ఓలా ఎస్1 స్కూటర్ మాడల్ లేదా రోడ్స్టర్ మోటర్సైకిల్ను కొనుగోలు చేసిన వారికి రూ.20 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ సోమవారం ముగియనున్నది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.10 వేల నగదు డిస్కౌంట్తోపాటు రూ.15 వేలు విలువైన ఎనిమిదేండ్ల బ్యాటరీ వ్యారంటీ ఉచితంగా అందిస్తున్నది.