Maruti Suzuki Alto | న్యూఢిల్లీ, ఆగస్టు 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి చెందిన ఎంట్రీలెవల్ మాడల్ ఆల్టో మరో చరిత్రను సృష్టించింది. 45 లక్షల విక్రయ మైలురాయికి చేరుకున్నది. 25 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మాడల్ ఇప్పటికీ కొనుగోలుదారుల మన్నలను పొందుతున్నది.
2004లో అత్యధికంగా అమ్ముడుపోయిన మాడల్ కూడా ఇదే కావడం విశేషం. 2008లో 10 లక్షల మార్క్కు చేరుకోగా.. 2012లో 20 లక్షలకు, 2016లో 30 లక్షలకు చేరుకున్నది. ఆగస్టు 2020లో 40 లక్షల మార్క్ను అధిగమించింది. సంస్థపై కస్టమర్లు పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శణమని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.