న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దూకుడు పెంచింది. వచ్చే ఐదేండ్లలో రూ.1.25 లక్షల కోట్లు మూలధన వ్యయం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో 17 మాడళ్లను విక్రయిస్తున్న సంస్థ..వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్యను 28కి పెంచుకోనున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.