న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. దేశీయంగా వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో మారుతి సుజుకీ, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గతేడాది జీఎస్టీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ సంస్థలు దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతున్నాయి.
జీఎస్టీ రేటు కోతతోపాటు ఆదాయ పన్ను ప్రయోజనాలు, రెపో రేటు తగ్గింపులతో లభించిన ఊపును ఆటోమొబైల్ పరిశ్రమ సద్వినియోగం చేసుకుంటున్నదని ఇదే జోష్తో ప్రస్తుత పండుగ సీజన్లోకి అడుగుపెడుతున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అటూ ఇటుగా 4.5 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు జరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది 3.3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
