హైదరాబాద్, జూన్ 6: కార్ల సంస్థ మారుతి సుజుకీ..హైదరాబాద్లో మరో సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో టచ్ పాయింట్ల సంఖ్య 147కి చేరుకోగా, దేశవ్యాప్తంగా 4,500కి చేరుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ..కార్ల మరమ్మత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకొక టచ్ పాయింట్ చొప్పున 350 సెంటర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతేడాది 310 టచ్ పాయింట్లను ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి మారుతి విప్లవాత్మక మార్పులు చేపట్టిందని, ముఖ్యంగా డిజిటల్ సేవలను విసృత పరిచినట్టు చెప్పారు.