Maruti Suzuki | ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి కస్టమ్స్ రిపార్ట్మెంట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. రూ.16.27లక్షల పన్ను ఎగువేతకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కస్టమ్స్ జారీ చేసిన నోటీసుకు చట్టబద్ధంగా సమాధానం ఇస్తామని కంపెనీ పేర్కొంది. కస్టమ్స్ పంపిన నోటీసుల కారణంగా కంపెనీ ఆర్థిక, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది.
గతకొద్ది వారాలుగా మారుతీ సుజుకీ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇటీవల 2019-20 సంవత్సరానికి రూ.2,159 కోట్ల పన్ను చెల్లించాలంటూ డ్రాఫ్ట్ అసెస్మెంట్ను ఆర్డర్ను ఐటీశాఖ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తామని, తమ ఆర్థిక, ఉత్పాదక కార్యకలాపాలపై ప్రభావం ఉండబోదని మారుతి స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అలాగే సెప్టెంబర్ 29న జీఎస్టీ అధికారులు కంపెనీకి నోటీసులు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న రూ.193.3కోట్లు తాఖీదులు పంపింది.